యాదాద్రి, జూన్29: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారికి నిత్యపూజలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. బుధవారం అర్చకులు స్వయంభువులకు ఆరాధనలు జరిపి, పంచామృతాలతో అభిషేకించారు. తులసీ అర్చనలు చేశారు.
అనంతరం లక్ష్మీనరసింహులు దివ్యమనోహరంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాకారంలో స్వామి, అమ్మవార్లను అలంకరించి నిత్య తిరుకల్యాణోత్సవం జరిపించారు. శ్రీవారి ఖజానాకు బుధవారం రూ.11,11,068 ఆదాయం వచ్చినట్టు ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు.