ముంబై: వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) సంస్థ బోర్డు నుంచి తప్పుకున్నారు. ఇన్నాళ్లూ ఆ బోర్డులో ఆమె డైరెక్టర్గా ఉన్నారు. అయితే రిలయన్స్ బోర్డులోకి ముఖేశ్ అంబానీ పిల్లలు ఎంటర్ అయ్యారు. ఇషా, ఆకాశ్, అనంత్ అంబానీలకు బోర్డులో స్థానం కల్పించారు. రిలయన్స్ సంస్థలో ఆ ముగ్గుర్నీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమించనున్నారు. 46వ వార్షక సమావేశా ల సందర్భంగా అధినేత ముఖేశ్ అంబానీ ఇవాళ మాట్లాడారు. నియామకంపై నిర్ణయం తీసుకోవాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కోరారు, అయితే షేర్హోల్డర్ల నుంచి ఆ అంశం పెండింగ్లో ఉంది.
నిజానికి గత కొన్నేళ్ల నుంచి ఈ ముగ్గురూ కంపెనీలో వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. రిటేల్, డిజిటల్ సర్వీసులు, ఎనర్జీ రంగాలకు చెందని వ్యాపారాన్ని చూసుకుంటున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. రిలయన్స్ అనుబంధ కంపెనీల బోర్డుల్లోనూ ముకేశ్ పిల్లలు ఉన్నారు. నీతా అంబానీ రాజీనామాను బోర్డు డైరెక్టర్లు అంగీకరించారు. కానీ అన్ని బోర్డు మీటింగ్లకు ఆమె ఓ పర్మనెంట్ ఇన్వైటీగా హాజరు అవుతుందని బోర్డు డైరెక్టర్లు తెలిపారు.