హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)-లేటరల్ ఎంట్రీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఎల్ఈఈఈ), పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (పీజీఈఈ) నోటిఫికేషన్లను విడుదల చేసింది.
లేటరల్ ఎంట్రీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఎల్ఈఈఈ)-2022
ఈ పరీక్ష ద్వారా లేటరల్ ఎంట్రీ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్లో ప్రవేశాలు కల్పిస్తారు.బీటెక్, ఎంఎస్ డిగ్రీలు.
ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేండ్లు.
మొదట బీటెక్ డిగ్రీని పూర్తిచేసి తర్వాత రిసెర్చ్ థీసిస్ పూర్తిచేసి ఎంఎస్ డిగ్రీని పొందవచ్చు.
బ్రాంచ్లు: ఈసీడీ: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్
సీఎస్డీ: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్
అర్హతలు: ఈసీఈ విభాగానికి బీఈ/ బీటెక్ (ఈసీఈ/ ఈటీఈ/ ఈఐఈ/ ఈఈఈ), సీఎస్ఈ విభాగానికి బీఈ/ బీటెక్ (సీఎస్ఈ/ ఐటీ) మూడో సెమిస్టర్ పూర్తిచేసి ఉండాలి. కనీసం 80 శాతం మార్కులు తప్పనిసరి.
పరీక్ష విధానం
ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్.
పరీక్షలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి.
ఈసీడీ విభాగానికి నిర్వహించే పరీక్షలో జనరల్ ఆప్టిట్యూడ్, డిజిటల్ లాజిక్, సర్క్యూట్ థియరీ అండ్ నెట్వర్క్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
సీఎస్డీ విభాగానికి నిర్వహించే ఎగ్జామ్లో జనరల్ ఆప్టిట్యూడ్, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, డిజిటల్ లాజిక్, డేటా స్ట్రక్చర్స్, సీ-ప్రోగ్రామింగ్ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
నోట్: పరీక్ష కాలవ్యవధి మూడు గంటలు.
పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (పీజీఈఈ) -2022
ఈ పరీక్ష ద్వారా ఎంటెక్, ఎంఎస్, పీహెచ్డీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఎంటెక్, ఎంఎస్ కోర్సుల కాలవ్యవధి రెండేండ్లు.
పీహెచ్డీ కోర్సు కాలవ్యవధి ఐదేండ్లు.
ఎంటెక్ స్పెషలైజేషన్లు
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ
కంప్యూటర్ ఎయిడెడ్ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్
ప్రొడక్ట్ డిజైన్ అండ్ మేనేజ్మెంట్
ఎంఎస్ స్పెషలైజేషన్లు
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్
సివిల్ ఇంజినీరింగ్
బయోఇన్ఫర్మాటిక్స్
ఐటీ ఇన్ బిల్డింగ్ సైన్స్
పీహెచ్డీ స్పెషలైజేషన్లు
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్
ఇంజినీరింగ్
సివిల్ ఇంజినీరింగ్
బయోఇన్ఫర్మాటిక్స్
ఐటీ ఇన్ బిల్డింగ్ సైన్స్
కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్
కంప్యూటేషనల్ నేచురల్ సైన్సెస్
స్పేషియల్ ఇన్ఫర్మాటిక్స్
కాగ్నిటివ్ సైన్స్
హ్యూమన్ సైన్సెస్
అర్హతలు: బీఈ/బీటెక్/ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణులు లేదా ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంఏ (మ్యాథ్స్) ఉత్తీర్ణులు.
ఎంటెక్ ప్రోగ్రామ్లో కంప్యూటర్ ఎయిడెడ్ స్ట్రక్చరల్ ఇంజినీరిగ్ స్పెషలైజేషన్కు సివిల్ ఇంజినీరింగ్లో బీఈ/ బీటెక్ పూర్తిచేసి ఉండాలి.
ఎంఎస్, పీహెచ్డీ ప్రోగ్రామ్లలో ఐటీ ఇన్ బిల్డింగ్ సైన్స్ స్పెషలైజేషన్కు బీఆర్క్/ఎంఆర్క్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పీహెచ్డీలో కాగ్నిటివ్ సైన్స్ స్పెషలైజేషన్కు కాగ్నిటివ్ సైన్స్/ సైకాలజీ/ లింగ్విస్టిక్స్/ ఫిలాసఫీ/ ఆంత్రోపాలజీ/ సైన్సెస్ విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసినవారు లేదా ఎంబీబీఎస్/ఎండీ ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
హ్యూమన్ సైన్సెస్ స్పెషలైజేషన్కు హ్యుమానిటీస్/ సోషల్ సైన్సెస్ విభాగాల్లో ఎంఫిల్/ఎంఏ ఉత్తీర్ణులు. బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతోపాటు ఐదేండ్ల అనుభవం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పీజీఈఈ పరీక్ష విధానం
ఈ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తారు.
ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. మొదటిది జనరల్ ఆప్టిట్యూడ్. దీనిలో బేసిక్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, కంప్యూటర్స్, మ్యాథ్స్ అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు.
రెండోది సబ్జెక్ట్ పేపర్. ఇందులో మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, సివిల్ విభాగాలు ఉంటాయి.
అభ్యర్థి డిగ్రీ స్థాయిలో చదివిన ప్రధాన సబ్జెక్ట్కు నిర్దేశించిన విభాగంలో పరీక్ష రాయాలి.
ఒక్కో పేపర్కు గంటన్నర చొప్పున మొత్తం పరీక్ష సమయం మూడు గంటలు. ఎంటెక్లో ప్రవేశానికి రెండు పేపర్లూ రాయాలి. ఎంఎస్, పీహెచ్డీ ప్రోగ్రామ్లకు సబ్జెక్ట్ పేపర్ ఉండదు. పీహెచ్డీలో హ్యూమన్ సైన్సెస్ స్పెషలైజేషన్కు ఎగ్జామ్ రాయనవసరం లేదు. వీరు రిసెర్చ్ స్టేట్మెంట్ సమర్పిస్తే సరిపోతుంది.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.2,500/-
చివరితేదీ: ఏప్రిల్ 3
ఎల్ఈఈఈ-2022,
పీజీఈఈ-2022 పరీక్ష తేదీ: ఏప్రిల్ 16
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్,
నిజామాబాద్.
వెబ్సైట్: https://www.iiit.ac.in