మౌంట్మాంగనీ (న్యూజిలాండ్): విదేశీ పిచ్లపై పెద్దగా ప్రభావం చూపలేకపోయే బంగ్లాదేశ్.. న్యూజిలాండ్తో తొలి టెస్టులో దుమ్మురేపుతున్నది. టాపార్డర్ సమిష్టిగా సత్తాచాటడంతో సోమవారం మూడోరోజు ఆట ముగిసే సమయానికి బంగ్లా తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. కెప్టెన్ మోమినుల్ హక్ (88), లిటన్ దాస్ (86), మహ్ముదుల్ హసన్ (78), నజ్ముల్ హుసేన్ (64) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. సొంతగడ్డపై న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 328 పరుగులకు ఆలౌట్ కాగా.. చేతిలో 4 వికెట్లు ఉన్న బంగ్లా ప్రస్తుతం 73 పరుగుల ఆధిక్యంలో ఉంది. యాసిర్ అలీ (11), మెహెదీ (20) క్రీజులో ఉన్నారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, నీల్ వాగ్నర్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.