వెంకటేష్, వరుణ్తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఎఫ్-3’. ప్రముఖ నిర్మాత దిల్రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. తమన్నా, మెహరీన్, సోనాల్చౌహాన్ కథానాయికలు. మే 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాలోని ‘ఊ..ఆ..ఆహా..ఆహా..ఆహా..’ అనే రెండో గీతాన్ని శుక్రవారం విడుదల చేశారు. దేవిశ్రీప్రసాద్ స్వరకర్త. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్నందించారు. క్యాచీ ట్యూన్తో సాగిన ఈ పాటలో ముగ్గురు నాయికలు తమ అందచందాలతో కనువిందు చేశారు. ‘హుషారుగా సాగుతూ ప్రేక్షకులందరిని ఆకట్టుకునే గీతమిది. శేఖర్ విజే చక్కటి నృత్యరీతుల్ని సమకూర్చారు. టైటిల్కు తగినట్లుగానే ఈ సినిమా మూడింతల వినోదంతో ప్రతి ఒక్కరి మోముల్లో నవ్వుల్ని విరబూయిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’అని చిత్రబృందం పేర్కొంది. రాజేంద్రప్రసాద్, సునీల్, పూజాహెగ్డే (స్పెషల్ అప్పియరన్స్) తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సహనిర్మాత: హర్షిత్ రెడ్డి, నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, నిర్మాత: శిరీష్, దర్శకత్వం: అనిల్ రావిపూడి.