హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : లక్కీడ్రా ద్వారా దుకాణాలను పొందిన కొత్త లైసెన్స్దారులకు ఈ నెల 29 నుంచి మద్యం సరఫరా చేయనున్నట్టు ఎక్సైజ్శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. నూతన మద్యం పాలసీ(2021-23) డిసెంబర్ ఒకటి నుంచి అమల్లోకి రానుండటంతో లైసెన్స్దారులు మద్యం కోటా కొనుగోలు చేసుకునేలా అన్ని డిపోల్లో తగిన ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల ఎక్సైజ్ అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. నూతన రిటైలర్లకు నంబర్లను కేటాయించి, వాటికి సిస్టంలో లాగిన్ అప్డేట్స్ ఇవ్వాలని సూచించారు.