ముజాఫర్నగర్: మైనర్ను వేధించిన కేసులో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికీకి క్లీన్చిట్ వచ్చింది. యూపీలోని ముజాఫర్నగర్ కోర్టు ఈ క్లీన్ చిట్ ఇచ్చింది. నవాజుద్దీన్తో పాటు మరో నలుగురు కుటుంబసభ్యులకు క్లియరెన్స్ దక్కింది. పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి సంజీవ్ కుమార్ తివారి ఈ కేసులో తీర్పునిస్తూ.. విచారణ పూర్తి నివేదికను సమర్పించాలన్నారు. నవాజ్ సోదరులు మినాజుద్దీన్, ఫయాజుద్దీన్, అజాయుద్దిన్తో పాటు తల్లి మెహరూనిసాకు ఈ కేసులో క్లీన్ చిట్ దక్కింది. 2012లో ఓ మైనర్ను మినాజుద్దీన్ వేధించినట్లు కేసు నమోదైంది. ఆ సమయంలో ఇతర కుటుంబసభ్యులు నవాజ్కు సపోర్ట్ ఇచ్చినట్లు ఫిర్యాదులో తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ముంబైలోని వెరసోవా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత ఇదే కేసును ముజాఫర్నగర్లోని బుదానా పోలీస్ స్టేషన్కు తరలించారు.