హైదరాబాద్, ఆట ప్రతినిధి: సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్లో జరుగుతున్న జాతీయ పవర్లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. బుధవారం ఎల్బీ స్టేడియంలో ప్రారంభమైన టోర్నీలో 26 రాష్ర్టాల నుంచి 560 మంది లిఫ్టర్లు పోటీపడుతున్నారు. తొలి రోజు పోటీల్లో పురుషుల 53కిలోల విభాగంలో 32 మంది, 59కిలోల కేటగిరీలో 36 మంది బరిలో దిగారు. అంతకుముందు టోర్నీని రాష్ట్ర వెయిట్లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాసగుప్తా, లిఫ్టింగ్ సంఘం ఉపాధ్యక్షురాలు రాజేశ్వరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో క్రీడలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని సుధీర్రెడ్డి పేర్కొన్నారు. టోర్నీలో పాల్గొంటున్న ప్లేయర్లు, అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.