శ్రీరాంపూర్, ఆగస్టు 12 : సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు తమ ఇండ్లపై జాతీయ జెండాలు ఎగురవేసి, జాతీయ భావాన్ని చాటాలని శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి సూచించారు. ఎస్సార్పీ-3 గనిపై టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు సురేందర్రెడ్డితో కలిసి కార్మికులకు జాతీయ జెండాలు పంపిణీ చేశారు. పతాకాలు ఎగురవేసి, స్వాతంత్య్ర పోరాట అమరుల త్యాగాలను స్మరించుకోవాలని కోరారు. అలాగే జీఎం కార్యాలయంలో అధికారులు ఉద్యోగులకు జెండాలు పంపిణీ చేశారు. అనంతరం ఉద్యోగులతో కలిసి జాతీయ జెండాలు ప్రదర్శించి, సమైక్యతా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి, డీవైజీఎం గోపాల్సింగ్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ గోసిక మల్లేశం, డీవైజీఎం గోవిందరాజు, గని మేనేజర్ సంతోష్కుమార్, ఈఈ చంద్రశేఖర్, మహేందర్, డిప్యూటీ మేనేజర్లు పూర్ణచందర్, ఆంజనేయులు, ముర్ము, సీనియర్ పీవో మోహన్సింగ్, టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి ఆర్ గోపాల్రెడ్డి, నాయకులు భాస్కర్, వీరమల్ల, గోప్యా, అధికారుల సంఘం ఉపాధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్, పిట్ కార్యదర్శి పీవీ రావు పాల్గొన్నారు.
జెండాల పంపిణీ..
మందమర్రి రూరల్, ఆగస్టు 12 : స్థానిక జీఎం కార్యాలయ ఆవరణలో ఉద్యోగులకు జీఎం చింతల శ్రీనివాస్ జెండాలు పంపిణీ చేశారు. అనంతరం జెండా ప్రదర్శన చేపట్టారు. స్వాతంత్య్ర పోరాటాలకు గుర్తుగా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాలను తమ ఇంటిపై ఎగురవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం కృష్ణారావు, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేశ్, ఏజీఎం ఎఫ్ఆండ్ఏ చక్రవర్తి, ఏజీఎం ఈఅండ్ఎం రాంమూర్తి, పీఎం వరప్రసాద్, డీవైపీఎం శ్యామ్సుందర్, సీనియర్ పీవో మైత్రేయ బంధు, జీఎం కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్జీ-1లో ఫ్రీడం రన్..
గోదావరిఖని, ఆగస్టు 12 : పెద్దపల్లి జిల్లా ఆర్జీ-1 ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతను చాటేందుకు 24 మీటర్ల జాతీయ జెండాతో ఫ్రీడం రన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్జీ-1 జీఎం కే నారాయణ ముఖ్యఅతిథిగా హాజరై, జెండా ఊపి రన్ను ప్రారంభించారు. జీఎం కార్యాలయం నుంచి మెయిన్ రోడ్ రాజీవ్ గాంధీ విగ్రహం దాకా ర్యాలీ కొనసాగింది. ఇక్కడ డీజీఎం పర్సనల్ సీహెచ్ లక్ష్మీనారాయణ, అధికారులు రామకృష్ణ, ఆంజనేయులు, సాంబశివరావు, తిరుపతిరెడ్డి, టీబీజీకేఎస్ నాయకుడు ప్రవీణ్కుమార్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్స్ సారంగపాణి, నరేన్ చక్రవర్తి, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి, స్పోర్ట్స్ సూపర్వైజర్ రమేశ్, జీఎం కార్యాలయ ఉద్యోగులు ఉన్నారు.
సివిల్ డిపార్టుమెంట్లో..
యైటింక్లయిన్ కాలనీ, ఆగస్టు 12 : పెద్దపల్లి జిల్లా ఆర్జీ-2 ఏరియాలోని సివిల్ డిపార్టుమెంట్లో హర్ ఘర్ తిరంగ్ వేడుకలను చేపట్టారు. సివిల్ ఈఈ రాజు ముఖ్య అతిథిగా హాజరై ఉద్యోగులకు జాతీయ జెండాలను అందజేశారు. ప్రతి ఉద్యోగి క్వార్టర్పై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేటీవో రాధాకృష్ణ, సూపర్వైజర్ రాంకోటి, పిట్ కార్యదర్శి చంద్రమౌళి, ముస్కుల అనిల్ రెడ్డి, కోటేశ్, సుధాకర్, బుచ్చయ్య, లక్ష్మీనారాయణ, రాంరెడ్డి, శంకర్, సమ్మయ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.