న్యూఢిల్లీ: స్ట్రాంజా బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్ నందిని (+81 కిలోలు) సెమీస్కు దూసుకెళ్లి పతకం ఖాయం చేసింది. బల్గేరియా వేదికగా బుధవారం జరిగిన మహిళల క్వార్టర్స్లో యువ బాక్సర్ నందిని(81కి).. వలెరియా ఆక్సెనోవా (కజకిస్థాన్)పై ఏకపక్ష విజయం సాధించింది. ఆరంభం నుంచే ఈ యువ బాక్సర్ పదునైన పంచ్లతో ప్రత్యర్థిపై విరుచుకుపడింది. పంచ్ల వర్షానికి ఆక్సెనోవా చతికిలపడడంతో రిఫరీ మ్యాచ్ను అర్ధాంతరంగా నిలిపివేశాడు. సెమీస్లో అడుగుపెట్టిన నందిని లజ్జాట్ కుంగెబయెవా (కజకిస్థాన్)తో అమీతుమీ తేల్చుకోనుంది. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్స్లో అరుంధతి చౌదరి (70 కి), పర్వీన్ (63 కి) అద్భుత ప్రదర్శనతో క్వార్టర్స్కు దూసుకెళ్లారు. మిగతా మ్యాచ్ల్లో మీనా రాణి (60 కి), అంజలి తుషిర్ (66 కి), సవిటి (75 కి), సచిన్ కుమార్ (80 కి) నిరాశపర్చారు.