మెగా బ్రదర్ నాగబాబు మంగళవారం మధ్యాహ్నాం హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ని సందర్శించారు. అక్కడ వన్యప్రాణుల ఎన్క్లోజర్స్ని సందర్శించి వన్యప్రాణుల కోసం సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు.అనంతరం మాట్లాడిన ఆయన జూ సందర్శన చక్కని అనుభూతినిచ్చిందని పేర్కొన్నారు.
జూ నిర్వాహణ, వన్యప్రాణుల సంరక్షణ, పరిశుభ్రత చాలా చక్కగా నిర్వహిస్తున్నారని జూ మేనేజ్మెంట్ సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఒక జత సెనెగల్ రామచిలుకలను కొనుగోలు చేయాలంటూ రూ.35 వేల చెక్కును తన సోదరి విజయ తరఫున జూపార్కు క్యూరేటర్ వి.వి.ఎల్.సుభద్రాదేవికి అందజేశారు.
నాగబాబు ఇటీవల తన సోదరుడు చిరంజీవి బర్త్ డే వేడుకలో కనిపించి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆ వేడుకకు వచ్చిన పవన్ కళ్యాణ్ని గట్టిగా ముద్దుపెట్టుకున్న అతను ఆ తర్వాత సోదరీమణులతో రాఖీ కట్టించుకున్నాడు. మా అధ్యక్షుడు ప్రకాశ్ రాజ్కి తన సపోర్ట్ని అందిస్తున్న నాగబాబు ఆయన గెలుపు కోసం కృషి చేస్తున్నారు.