హైదరాబాద్, నవంబర్ 17: హైదరాబాద్కు చెందిన ఔషధ రంగ సంస్థ ఎంఎస్ఎన్ ల్యాబ్స్ శిశువుల కోసం యాంటీ-ఎపిలిప్టిక్ డ్రగ్ను పరిచయం చేసింది. విగానెక్స్ బ్రాండ్లో నోటి ద్వారా తీసుకునేలా దేశీయంగా వచ్చిన తొలి జనరిక్ విగాబ్యాట్రిన్ పౌడర్ ఇది కావడం విశేషం. కాగా, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదించిన ఈ ఔషధాన్ని ఎపిలిప్సీ వ్యాధిగ్రస్తుల కోసం దేశవ్యాప్తంగా వేగంగా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ ఈ సందర్భంగా తెలియజేసింది. ఒక్కో ప్యాక్లో 30 సాచెట్స్ ఉంటాయని, ఒక్కో సాచెట్లో 500 ఎంజీ పౌడర్ ఉంటుందని చెప్పింది.