రాబోయే ఐపీఎల్ 14వ సీజన్ కోసం మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ముమ్మరంగా సాధన చేస్తోంది. ట్రైనింగ్ క్యాంప్లో ధోనీతో పాటు అంబటి రాయుడు, ఎన్ జగదీషన్, కర్ణ్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను చెన్నై ఫ్రాంఛైజీ సోషల్మీడియాలో పోస్ట్ చేసింది. భుజానికి కిట్ బ్యాగ్ వేసుకొని చేతిలో బ్యాట్ పట్టుకొని నడుచుకుంటూ నెట్స్ ప్రాక్టీస్లో పాల్గొనడానికి వస్తున్న ధోనీ ఫొటో ఇంటర్నెట్లో వైరల్గా మారింది.
ఏప్రిల్ 9 నుంచి ఆరంభంకానున్న ఐపీఎల్ కోసం చెన్నై సన్నద్ధమవుతోంది. ట్రైనింగ్ క్యాంప్లో ఆటగాళ్లందరూ ఉత్సాహంగా సాధన చేస్తున్నారు. ఇటీవల ధోనీ టీమ్ కొత్త జెర్సీని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్తో చెన్నై సీజన్ను ఆరంభించనుంది. స్టార్ ప్లేయర్లు సురేశ్ రైనా, జడేజా ఇంకా జట్టులో చేరాల్సి ఉంది.