బేగంపేట్ : సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి దేవాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గురువారం దేవాలయంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అలాగే ఉదయం 10:15 నిమిషాలకు శ్రీ విద్యా శంకర భారతి మహాస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ క్రమంలో ఆలయంలో ఆయుష్షు హోమం నిర్వహించి కోటి కుంకుమార్చన ముగింపు పూజల సంధర్భంగా మహిళలకు చీరల పంపిణీ చేశారు. అలాగే లోక కళ్యాణార్ధం 44 రోజల దీక్ష పూర్వక కృష్ణ యజుర్వేద పారాయణం నిర్వహించారు.
అలాగే గంగాధర కేదార నాథ శర్మ ఘనపాటి శ్రీ రాజరాజేశ్వర సాంగ వేద విద్యాలయం వారి సంపూర్ణ సహాకారాలతో 10 మంది వేద పండితులతో అఖండ వేద పారాయణ యజ్ఞం చేశారు. ఈ కార్యక్రమంలో రాంగోపాల్పేట్ కార్పొరేటర్ చీర సుచిత్ర, మాజీ కార్పొరేటర్ కోషికే కిరణ్మయికిషోర్, ఈవో గుత్తా మనోహార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.