కేతేపల్లి: గులాబ్ తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మూసీ ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు సోమవారం ప్రాజెక్టు 6 క్రస్టు గేట్లను 4 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదిలారు.2, 3,4,7,10,11 నంబరు గేట్ల ద్వారా 10884.04 క్యూసెక్కుల నీటిని ముం దస్తుగా నదిలోకి విడుదల చేశారు. కాలువలకు 299.44 క్యూసెక్కుల నీరు వెళుతుంది.8946.10 క్యూసెక్కులు ఇన్ఫ్లో కొనసాగుతుంది.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు)కాగా, ప్రస్తు తం 641.20 అడుగులు(3.50 టీఎం సీలు)గా ఉన్నట్లు ఏఈ డి.ఉదయ్కుమార్ తెలిపారు. ప్రాజెక్టు వద్ద పరిస్థితిని ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎగు వ నుంచి వస్తున్న ఇన్ఫ్లోను అంచనా వేస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.