శాయంపేట, డిసెంబర్ 16: ఓ నిరుపేద మహిళ ఇంటిని కోతులు గుల్లచేశాయి. కూలి పనులు చేసుకుంటే తప్ప పూట గడవని వృద్ధురాలి ఇంటిని వానరాలు ఆగం చేశాయి. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేటలో గురువారం చోటుచేసుకున్నది. గుంపుగా వచ్చిన కోతులు గొట్టిముక్కుల సరోజన ఇంటి పెంకులను ధ్వంసం చేశాయి. లోనికి చొరబడి 50 కిలోల బియ్యాన్ని నేలపాలు చేశాయి. ఉప్పు, కారం ఇతర సామగ్రిని పారబోశాయి. కూలి పనుల నుంచి వచ్చిన సరోజన ఇంట్లోని పరిస్థితిని చూసి లబోదిబోమని విలపించింది.