కుత్బుల్లాపూర్, డిసెంబర్ 14 : కుత్బుల్లాపూర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన 54 మంది విద్యార్థులకు ఎమ్మెల్సీ శంభీపూర్రాజు మంగళవారం యూనిఫాంలు అందజేశారు. ఈ సందర్భంగా పేద, మధ్యతరగతి అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికీ మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తుందని, విద్యార్థులు సైతం అత్యుత్తమ ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశించారు. కార్యక్రమంలో ఎంఎల్ఆర్ఐటీ అధినేత మర్రి లక్ష్మారెడ్డి, కౌన్సిలర్ జక్కుల కృష్ణయాదవ్, భీమ్సింగ్, కళాశాల కో-ఆర్డినేటర్ నారాయణరావు, ఆకుల ప్రభాకర్గుప్తా, చైతన్య తదితరులు పాల్గొన్నారు.
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కే2కే సైకిల్ రైడ్ను 23రోజుల్లో పూర్తి చేసుకున్న 13మంది రైడర్లను మంగళవారం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అభినందించారు. 13 రాష్ర్టాల మీదుగా.. రైడ్ను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా జట్టును అభినందించారు. ఈ కార్యక్రమంలో సైకిలిస్ట్ గ్రూప్ వ్యవస్థాపకుడు రవీందర్, రైడర్స్, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.