చిక్కడపల్లి, డిసెంబర్ 12: భారత దేశ చరిత్రలో రజకులకు ఉచిత విద్యుత్ అందించిన ఘన త సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య అన్నారు. తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం(టీఆర్వీఎస్)ఆదివారం బాగ్ లింగంపల్లిలోని సుందర య్య విజ్ఞాన కేంద్రంలో ‘రజక వృత్తిలో ఉపాధి- ఆధునీకరణ’పై రాష్ట్ర వృత్తి శిక్షణ సదస్సును నిర్వహించారు. ఇందుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మాట్లాడారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎన్నికల కారణంగా సీఎం దగ్గర రజక వృత్తిదారులకు సంబంధించిన కొన్ని ఫైళ్ళు పెండింగ్లో ఉన్నాయని, అవి పూర్తయ్యేలా కృషి చేస్తానన్నారు. రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య మాట్లాడుతూ ఉచిత విద్యుత్ లబ్ధిదారులకు రూ.5లక్షల రజక బీమా ఎల్టీ-4లో చేర్చాలన్నారు. సదస్సులో రజక ఫెడరేషన్ మెనేజింగ్ డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్, జనగాం మధుమోహన్, రజక వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు గుమ్మడి రాజు, సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎం.వి. రమణ, ప్రదీప్కుమార్, సంఘం నాయకులు ఎం.బాలకృష్ణ, మల్లేశ్, జ్యోతిఉపేందర్, వెంకటస్వామి, రాములు, చక్రపాణి, ఉమేశ్, లింగస్వామి, సుభద్ర, గోపాల్, నరేశ్ పాల్గొన్నారు.