అవ్వలూ బాగున్నారా? పాణం మంచిగున్నదా..? పింఛన్ అత్తందా..? అని కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వృద్ధులను ఆప్యాయంగా పలుకరించారు. బుధవారం ఆయన మానకొండూర్ మం డలంలోని మద్దికుంట, దేవంపల్లిలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసేందుకు వెళ్తూ మార్గమధ్యంలో పచ్చునూరు దళిత కాలనీలో వృద్ధులను చూసి ఆగి ఆరా తీశారు. సీఎం కేసీఆర్ సారు చలువతో మంచిగ బతుకుతున్నమని వారు ఎమ్మెల్యేకు సంతోషంగా చెప్పారు.
– మానకొండూర్ రూరల్