మల్కాజిగిరి, డిసెంబర్ 12: పేదల ఆరోగ్యమే లక్ష్యం గా ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసిందని.. వీటి ద్వారా వైద్య సేవలు అందిస్తున్నదని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు అన్నారు. ఆదివారం వెంకటాపురం డివిజన్లో, మచ్చ బొల్లారం డివిజన్లోని కౌకూర్లో బస్తీ దవాఖానలను స్థానిక కార్పొరేటర్లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. ప్రజలకు మెరుగైన ఆరోగ్యం కోసం కార్పొరేట్ దవాఖానలకు దీటుగా ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి.. అందులో అన్ని సౌకర్యాలు కల్పించిందని అన్నారు. నియోజకవర్గంలో మేడ్చల్-మల్కాజి గిరి జిల్లా దవాఖాన, రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మూ డు పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటుగా పది బస్తీ దవాఖానలు వైద్య సేవలు అందిస్తున్నాయని అన్నారు. కార్పొరేట్ దవాఖా నలో చికిత్స చేసుకున్నవారికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సహాయం అందజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్, ఉప వైద్యాధికారి ఆనంద్, విటల్రావు, డాక్టర్ ప్రసన్నలక్ష్మి, స్నేహ, బాలమణి, డాక్టర్ ప్రదీప్రెడ్డి, కార్పొరేటర్లు సబితాకిశోర్, రాజ్ జితేంద్రనాథ్, అనిల్కిశోర్, బాబు, సురేందర్రెడ్డి, మల్లికార్జున్, వెంకటేశ్గౌడ్, వెంకటేశ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.