కుత్బుల్లాపూర్,డిసెంబర్5: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అన్ని కాలనీల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఆదివారం జీడిమెట్ల డివిజన్ వుడ్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను మర్యాదపూర్వకంగా కలిసి కాలనీలోని పలు మౌలిక వసతులపై వినతిపత్రాన్ని అందజేశారు. కాలనీలో భూగర్భ డ్రైనేజీ, వాటర్ పైపులైన్, పంచతత్వపార్క్ వంటి వాటిని అభివృద్ధి చేసి కాలనీవాసులకు మరిన్ని సదుపాయాలను కల్పించాలని కోరారు. కాలనీవాసుల సమస్యలను త్వరగా పరిష్కరించేలా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు శివరామకృష్ణ, శ్రీహరి, ఉదయ్కుమార్, రవీందర్రెడ్డి, కమల్ కిషోర్, స్వామి, పి.కృష్ణ, కే.కృష్ణ, శ్రీహరి, ఉదయ్కుమార్, రవీందర్రెడ్డి, నాగరాజు, శ్రీనివాస్, నాగరాజు, జగన్రెడ్డి, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జీడిమెట్ల, డిసెంబర్ 5: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ తన వంతు సహాయంగా నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం తన నివాసంలో సుభాష్నగర్ డివిజన్ పరిధి మోడీ బిల్డర్స్కు చెందిన ఉదయదుర్గ భర్త ఇటీవల మృతి చెందాడు. నిరుపేద కుటుంబం కావడంతో ఆ మహిళ ఎమ్మెల్యేను ఆశ్రయించారు. మానవతాదృక్పథంతో స్పందించిన ఎమ్మెల్యే ఆమె కుమారుడు శ్రీరాం కార్తీక్ ఉన్నత చదువుల నిమిత్తం రూ.50వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలాగే అపురూపకాలనీలో నివాసం ఉంటున్న మహిళ రాజేశ్వరి తన భర్త అకాల మరణంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులకు గురైంది. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే విజయకుమారి, జయకుమారి, జ్యోతిబాబుల చదువుల నిమిత్తం రూ.50 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమం లో స్థానికులు రామకృష్ణ, వెంకటరత్నం పాల్గొన్నారు.
గాజులరామారం సర్కిల్ చింతల్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ చింతల్లో ఆదివారం అయ్యప్ప స్వాములు ఏర్పా టు చేసిన అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గాజులరామారం,డిసెంబర్5: గ్యార్వీ ఉత్సవాలు హిందూముస్లింల ఐక్యతకు నిదర్శనమని ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ అన్నారు. గాజులరామారం డివిజన్ పరిధిలోని అంబేద్కర్నగర్లో గౌసే ఆజం దస్తగిరి దర్గా వద్ద నిర్వహించిన గ్యార్వీ ఉత్సవాల్లో ఆదివారం ఆయన తో పాటు స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరిరావు ముఖ్య అతిథిలుగా హాజరై ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు విజయ్రామ్రెడ్డి, సీనియర్ నాయకులు రషీద్బేగ్, శ్రీనివాస్ యాదవ్, నవాబ్, ఆబీద్, మసూద్, అజయ్గుప్త, ఇబ్రహీం ఖాన్, శివ ముదిరాజ్, ఇమ్రాన్, జాఫర్, జహంగీర్, సంతోష్, మోయిన్, బిలాల్, వెంకట్, హాజీ, సోహైల్ తదితరులు పాల్గొన్నారు.