కాచిగూడ, డిసెంబర్ 15: నియెజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా తాను పని చేస్తున్నానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గోల్నాక డివిజన్ దుర్గాసింగ్లైన్లో రూ.11 లక్షలతో సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్గౌడ్తో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే, కార్పొరేటర్, అధికారులతో పాద యాత్ర చేసి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డివిజన్లోని డైనేజీ, పలు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో మౌలిక సదుపాయలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానికులు పర్యవేక్షించినప్పుడే నాణ్యమైన పనులు జరుగుతాయన్నారు. బస్తీలో ఉన్న సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్గౌడ్, డీఈ సుధాకర్, ఏఈ ఫరీద్, ఏఎంహెచ్వో జ్యోతి, వర్క్ ఇన్స్పెక్టర్ మనోహర్, మహేందర్ యాదవ్, దీపక్, శైలేశ్కుమార్, లలిత్కుమార్, డాక్టర్ శైలేశ్సింగ్, భాస్కర్, రఘునాథ్, ప్రదీప్, మల్లేశ్గౌడ్, బాల్రాజ్, పడకంటి అంజయ్యచారి, ప్రభాకర్ముదిరాజ్, పి.సంతోశ్, లక్ష్మి ముదిరాజ్, వెంకులు, యూసుప్ షరీఫ్, అక్రం, ఉమేశ్ పాల్గొన్నారు.