ఎల్బీనగర్, డిసెంబర్ 7: ప్రతి ఒక్కరూ పేదలు, అనాథలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ది సురక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ కళాశాలల విద్యార్థులతో కలిసి సోమవారం రాత్రి దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ పరిసరాల్లో ఫుట్పాత్లపై నిద్రిస్తున్న పేదలు, అనాథలకు దుప్పట్లు, స్వెటర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సాయికుమార్, యాద శంకర్, చందు, వాసిరెడ్డి, ప్రీతం, సాగర్, వెంకటేశ్, రాకేశ్, కార్తిక్, అఖిల్, మణి, తదితరులు పాల్గొన్నారు.