హైదరాబాద్, జనవరి 17(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా రైతులతో మమేకమై, వారి అవసరాలు తీర్చే విధంగా పనిచేయాలని జిల్లా మార్కెటింగ్ కో-ఆపరేటివ్ సొసైటీల చైర్మన్లకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు సూచించారు. రైతుబంధు పథకం కింద అన్నదాతలకు రూ.50 వేల కోట్ల పంపిణీ పూర్తయిన సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్లు సోమవారం మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. రైతులకు రూ.50 వేల కోట్లు పంపిణీ చేయడాన్ని అరుదైన ఘనతగా అభివర్ణించారు.