న్యూఢిల్లీ: ఏడవ వేతన సంఘం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఫిట్మెంట్ విషయంలో రేపు క్లారిటీ వచ్చే ఛాన్సు ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఫిట్మెంట్పై బుధవారం జరిగే క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఫిట్మెంట్పై నిర్ణయం తీసుకుంటే, అప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం భారీగా పెరిగే ఛాన్సు ఉంది. ఫిట్మెంట్ను 2.57 నుంచి 3.68 శాతానికి పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ స్థాయిలో ఫిట్మెంట్ పెరిగితే అప్పుడు కనీస జీతం 18 వేల నుంచి 26వేలకు చేరుతుందని కొన్ని వార్తల ద్వారా తెలుస్తోంది. 2017 జూన్లో కేంద్ర క్యాబినెట్ 7వ వేతన సంఘం సిఫారసులను ఆమోదించిన విషయం తెలిసిందే.