న్యూఢిల్లీ: ఈ వారం ప్రారంభంలో చైనా మార్కెట్లో విడుదలైన ‘ఎంఐ 11 అల్ట్రా’ మోడల్ త్వరలో భారత్ సహా ప్రపంచ విపణిలో అడుగు పెట్టనున్నది. ఇందులో 50 మెగాపిక్సల్ ప్రైమరీ శ్యామ్సంగ్ జీఎన్2 కెమెరా సెన్సార్, 2కె అమోలెడ్ డిస్ప్లే, వెనకవైపు సెకండరీ డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 888 చిప్సెట్ తదితర ఫీచర్లు జత కలిశాయి. దీని ధర భారత్లో రూ. 70 వేలు ఉండవచ్చునని సమాచారం. ఇప్పటికే ఎంఐ 11 ప్రొ, ఎంఐ 11 లైట్ 5జీ ఫోన్లతోపాటు ఎంఐ 11 అల్ట్రాను ఈ వారం ప్రారంభంలో షియోమీ చైనాలో విడుదల చేసింది.
ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్ఫోన్ రూ. 70 వేల కనీస ధరతో భారత మార్కెట్లోకి వస్తుందని తెలిపింది. షియోమీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఫోన్లలో దీని ధరే అత్యధికం. ఎంఐ 11 అల్ట్రా ఫోన్ ఆవిష్కరణ సమయంలో ‘సూపర్ ఫోన్’గా షియోమీ పేర్కొన్నది.
ఈ ఫోన్ 8జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజీ సామర్థ్యం గల ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్ఫోన్ ధర చైనా కరెన్సీలో 5,999 యెన్లు (దాదాపు రూ. 67 వేలు). 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజీ ఆప్షన్ గల ఫోన్ ధర 6,499 చైనీస్ యెన్లు (రూ. 72,600).
టాప్ ఎండ్ వేరియంట్ 12జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజీ సామర్థ్యం గల మోడల్ ధర 6,999 యెన్లు (దాదాపు రూ. 78,200). 12జీబీ ర్యామ్+256 జీబీ వేరియంట్ 1,199 యూరోల (దాదాపు రూ. 1,03,400) ధరతో యూరోపియన్ మార్కెట్లోనూ ఇది అడుగుపెడుతున్నది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
బ్లడ్ క్యాన్సర్.. లక్షణాలు ఎలా ఉంటాయి.. చికిత్స ఏంటి..?
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సేంద్రియ వ్యవసాయం
ఏప్రిల్లో భారత్లో విడుదలయ్యే టాప్ స్మార్ట్ఫోన్లు ఇవే!