హైదరాబాద్, నవంబర్ 29: బెంగళూరుకు చెందిన మాంసం విక్రయ సంస్థ నందూస్.. తాజాగా హైదరాబాద్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. దేశవ్యాప్త వ్యాపార విస్తరణలో భాగంగా భాగ్యనగరంలో రెండు మాంసం విక్రయ కేంద్రాలను ఆరంభించింది. వచ్చే నెల చివరినాటికి ఐదు స్టోర్లను ప్రారంభించనున్న సంస్థ.. వచ్చే ఏడాది చివరిలోగా 15 స్టోర్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ ఫౌండర్ నరేంద్ర మాట్లాడుతూ.. నూతన వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడి మార్కెట్లోకి ప్రవేశించినట్లు చెప్పారు. బెంగళూరులో 50 స్టోర్లను నిర్వహిస్తున్న ఈ సంస్థ.. దేశవ్యాప్తంగా వచ్చే నాలుగేండ్లలో 600 స్టోర్లకు విస్తరించనున్నట్లు తెలిపింది.