‘తెలుగు ప్రేక్షకులు సినిమాని గొప్పగా ప్రేమిస్తారు. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా ఎదిగింది. తెలుగు సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని రూల్ చేస్తోంది’ అన్నారు కథానాయిక ఐశ్వర్య లక్ష్మి. ఆమె విష్ణువిశాల్తో కలిసి నటించిన చిత్రం ‘మట్టి కుస్తీ’. డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఐశ్వర్య మాట్లాడుతూ ‘ కొవిడ్కి ముందే ‘మట్టి కుస్తీ’ కథ విన్నాను. ఇందులో నా పాత్ర చాలా సవాల్తో కూడుకున్నది. ఇదొక ఫ్యామిలీ డ్రామా. భార్యాభర్తల కుస్తీ, ఇగో, వినోదం అన్నీ ఎలిమెంట్స్ చిత్రంలో ఉంటాయి. ఆడ,మగ సమానమే అనే సందేశాన్ని చాలా వినోదాత్మకంగా చూపించారు. విష్ణు విశాల్ ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాడు. నటుడిగా, నిర్మాతగా ఆయన ప్రయాణం అద్భుతం. ఈ చిత్రం హీరోయిన్గా నాకు మరింత గుర్తింపు తీసుకువస్తుందనే నమ్మ కం ఉంది. సినిమాల ఎంపిక విషయంలో నాకు ఎలాంటి తొందర లేదు. మంచి కథలతో అందరూ గుర్తుపెట్టుకునే పాత్రలనే చేయాలనేది నా ప్రయత్నం’ అన్నారు.