హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంపై నిందలు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలను వల్లె వేస్తున్నదని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ధాన్యం సేకరణలో అలసత్వం వహిస్తున్నదని, సీఎంఆర్ ఇవ్వడంలో ఆలస్యం చేస్తుందంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
గురువారం సివిల్సైప్లె భవన్లో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకుండా రాష్ట్రం మీదకు బాధ్యతను తోసేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యానికి, సీఎంఆర్ ఆలస్యానికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం కాదా అని ప్రశ్నించారు. ఎఫ్సీఐ గోదాముల ముందు వందల లారీలు బారులు తీరింది కనిపించడంలేదా అని నిలదీశారు. గోదాములు ఇవ్వకుండా, ఉన్న బియ్యంను తరలించకుండా సీఎంఆర్ తీసుకోవడంలో ఎఫ్సీఐ కావాలనే ఆలస్యం చేస్తున్నదని స్పష్టంచేశారు.
ఎఫ్సీఐ ప్రతిరోజు ఎంత కావాలంటే అంత బియ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఆలస్యం లేదని, ఇప్పటివరకు రూ.8 వేల కోట్ల విలువైన 40 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్టు వివరించారు. దేశంలో వేగంగా ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణది మూడో స్థానమని, దక్షిణాదిలో తొలిస్థానం అని పేర్కొన్నారు. ఈ సీజన్లో ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి నూతన ఓటీపీ విధానం వల్లే సేకరణలో కొంత ఆలస్యం జరిగిందని స్పష్టంచేశారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ధాన్యం కొనుగోళ్లపై వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.