ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య
మొదట కూతురు, కుమారుడు.. అనంతరం తల్లిదండ్రులు..
కాసిపేట, మార్చి 25 : కాసిపేట మండలం మల్కేపల్లి గ్రా మానికి చెందిన జంజిరాల రమేశ్(45), పద్మ (40) దంపతులకు కూతురు సౌమ్య (20), కుమారుడు అక్షయ్ (17) ఉన్నారు. గతేడాది మార్చి 12న సౌమ్యను హాజీపూర్ మం డలం రాపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్కు ఇచ్చి వివాహం చేశారు. కుమారుడు అక్షయ్ స్థానిక ధర్మారావుపేట పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. రమేశ్ ఈ ఏడాది కొంత భూమిని కౌలుకు తీసుకుని పత్తి వేశాడు. వచ్చిన ఆదాయంలో రూ. 20 వేలు కూలీలకు ఇచ్చాడు. మరో రూ.3 లక్షలు అప్పాల శేఖర్ అనే వ్యాపారీకి అప్పు కట్టాడు. పంట సాగులో నష్టం వచ్చింది. దీనికి తోడు గతేడాది మార్చిలో తన కూతురు వివాహం కూడా చేశాడు. మొ త్తంగా రూ. 16 లక్షల దాకా అప్పులు అయ్యాయి. అవి తీర్చే మార్గం లేకపోవడంతో పరువు పోతుందని భావించి భార్యా పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు.
మొదట కుమారుడు, కుమార్తె..?
సౌమ్య ఇటీవల అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చింది. మొ దట కుమార్తె, కుమారుడు ఉరి వేసుకున్న తర్వాత.. దంపతులిద్దరూ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బుధవారం రాత్రే బలవన్మరణానికి పాల్పడి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. గురువా రం ఉదయం ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో చుట్టు పక్క వాళ్లు వెళ్లి చూసే సరికి తలుపులు తెరిచే ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా నలుగురి మృతదేహాలు క నిపించాయి. ఒకే కుటుంబంలో నలుగురు మృత్యువాత ప డడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నా యి. బంధువుల రోదనలు అక్కడున్న వారికి కంటతడి తె ప్పించాయి. మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. ఆ త్మహత్యలకు గల కారణాలను తెలుసుకున్నారు. బెల్లంపల్లి ఏసీపీ రహెమాన్, బెల్లంపల్లి సీఐ జగదీశ్, దేవాపూర్ ఎస్ విజయేందర్, కాసిపేట ఎస్ఐ రాములు దర్యాప్తు చేస్తున్నా రు. గ్రామ శివారులో నలుగురి మృతదేహాలకు పోస్టుమా ర్టం నిర్వహించారు. అనంతరం దహన సంస్కారాలు చేశారు.
పళ్లైన ఏడాదికే…
రమేశ్ కూతురు సౌమ్య(20) పళ్లైన ఏడాదికే తనువు చాలించిన ఘటన అందరినీ కంటతడి పెట్టించింది. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఏడాదికే ఆమె మృతి చెందడం కలచివేసింది. ఇటీవల మొదటి వివాహ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకున్నారు. తనతో అన్యోన్యంగా ఉండేదని, ఇక్కడికి పంపించకున్నా బతికేదంటూ సౌమ్య భర్త శ్రావణ్ కన్నీరుమున్నీరయ్యాడు. కాగా, “అప్పులు ఎక్కువైనయి. నా పిల్లలు నీవు లేకపోతే మేం బతుకలేం అన్నారు. నా పిల్లలను అనాథలుగా ఊహించుకోలేను. అందుకే అందరం కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నాం.” అంటూ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు.