నాగర్కర్నూల్, డిసెంబర్ 27 : తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధిలో భాగం గా మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వా రా చేపడుతున్న పనులను త్వరగా పూర్తి చే యాలని అదనపు కలెక్టర్ మనూచౌదరి సూ చించారు. పనులు పూర్తయితే ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయి సదుపాయాలతో స్పష్టమైన మార్పులు సంతరించుకోనున్నాయన్నారు. మంగళవారం నాగర్కర్నూల్ ప ట్టణ పరిధిలోని సంజయ్నగర్ ప్రాథమిక పాఠశాలలో రూ.19.67 లక్షలతో చేపడుతు న్న మన ఊరు-మనబడి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు వెచ్చి స్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చే స్తున్న మన ఊరు-మనబడి కార్యక్రమం పనులు పూర్తి చేసి జనవరి 6వ తేదీన ప్రా రంభించేందుకు పాఠశాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. పాఠశాల కమిటీకే పనుల బాధ్యతలు అప్పగించినందున, ప్రభుత్వ బడులను కార్పొరేట్స్థాయిలో తీర్చిదిద్దుకోవాలని హితవు పలికారు. పనులకు సంబంధించి పలు సూచనలు చేశారు. పనులకు ని ధులు గ్రీన్ చానల్ ద్వారా విడుదల చేస్తామ ని తెలిపారు.
గోడలకు ఎక్కడ కూడా పగుళ్లు కనిపించకూడదని, అలాంటిచోట్ల స్క్రబ్ చే యించిన తర్వాత ప్లాస్టింగ్ పనులు చేయాలని తెలిపారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని ఎస్ఎంసీ ప్రతినిధులు సొంత పనులుగా భావిస్తూ పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని సూచించారు. కిటికీలు, తలుపులకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించాలని, పైకప్పు లీకేజీలు ఉండరాదన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 40 పాఠశాలలను జనవరి 6వ తేదీ నాటికి మండలానికి రెండు పాఠశాలల చొప్పున ప్రారంభం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు మండల విద్యాధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టరేట్ సమీక్ష సమావేశం నిర్వహించి, పాఠశాలల నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి గోవిందరాజులు, ఏఈ ప్రశాంత్, వెంకటేశ్వర్శెట్టి తదితరులు ఉన్నారు.