న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్లు నెటిజన్ల ముఖాలపై నవ్వులు పూయిస్తే..మరికొన్ని హృదయాన్ని తాకుతాయి. మందర్ నటేకర్ అనే వ్యక్తి తన తండ్రి, మామ రోడ్డు ట్రిప్ సందర్భంగా కారులో నిద్రిస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో (Viral Post) పోస్ట్ చేయగా ఇప్పుడది వైరల్గా మారింది.
ఈ పోస్ట్కు ఇచ్చిన క్యాప్షన్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తండ్రి, మామను ఆయన చిన్నారులతో పోల్చారు. తండ్రులిద్దరినీ రోడ్ ట్రిప్కు తీసుకువెళ్లడం పిల్లలను తీసుకెళ్లడం కంటే తక్కువేమీ కాదు..వీరు కునుకు తీస్తారు..వారు లేవగానే ఆహారం, ఛాయ్..ఆపై మళ్లీ నిద్ర ఈ సైకిల్ రిపీటవుతుంది..ఈ మధ్యలో జ్ఞాపకాలు, కధలతో కాలక్షేపం అని పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చారు.
Taking both dads on a road trip is nothing short of taking two kids along. Naps galore, when they wake up they want food, chai, loo break then nap again and then the cycle repeats. In between peppered with anecdotes and old stories…mazaa ! pic.twitter.com/zxK8IGIjvu
— Mandar Natekar (@mandar2404) April 25, 2023
ఈ పోస్ట్కు నెటిజన్లు పెద్దసంఖ్యలో రియాక్టయ్యారు. సో బ్లెస్డ్ అని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఇలాంటి మధుర క్షణాలు మీరు ఎన్నో ఆస్వాదించాలని కోరుకుంటున్నామని మరో యూజర్ రాసుకొచ్చారు.