ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 50 నాటుకోడి గుడ్లతో చేసిన ఆమ్లేట్లను ఓ వ్యక్తి గుటకాయస్వాహా చేశాడు. ఒకటి రెండు గుడ్లతో చేసిన ఆమ్లేట్లను తింటే చాలు.. కడుపు నిండిపోతుంది. కానీ.. సాపట్టు రామన్ అనే వ్యక్తి ఒకేసారి 50 నాటుకోడి గుడ్లను తినేశాడు. రికార్డు క్రియేట్ చేశాడు.
సాపట్టు రామన్కు తన పేరు మీదే యూట్యూబ్ చానెల్ ఉంది. దాంట్లో ఇలాంటి ఫుడ్ చాలెంజ్లు చేస్తుంటాడు. అలా 50 నాటుకోడి గుడ్లతో చేసిన ఆమ్లేట్లను తిన్నాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి రామన్ ఈ ఫీట్ను 2 ఏళ్ల కిందనే సాధించినప్పటికీ.. దానికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కేవలం 18 నిమిషాల 18 సెకండ్లలో రామన్ 50 ఆమ్మేట్లను తినేశాడు. మధ్య మధ్యలో కాసిన్ని నీళ్లు తాగుతూ అంత తక్కువ సమయంలో ఎక్కువ ఆమ్లేట్లను తినడం గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.