హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఐటీ సర్వ్ అలయన్స్ ప్రతినిధులతో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖల కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల సమావేశమయ్యారు. త్వరలో నిజామాబాద్ జిల్లాలో పూర్తి కానున్న ఐటీ హబ్తో అక్కడి మౌలిక వసతులను పరిశీలించాలని ఆయా సంస్థల ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగాన్ని విస్తరించడానికి మంత్రి కేటీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు తదితర
విషయాలను ఆయా సంస్థల ప్రతినిధులతో మహేశ్ బిగాల చర్చించారు. నిజామాబాద్లోని ఐటీ హబ్ 5
ఫ్లోర్లతో 55వేల ఎస్ఎఫ్టీల మేర నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ ఐటీ హబ్ అభివృద్ధికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే గణేశ్ బిగాల ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి కల్పించేలా అక్కడ చర్యలు చేపట్టారని మహేశ్ బిగాల తెలిపారు. ఐటీ హబ్కు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే గణేశ్ బిగాల హామి ఇచ్చారని మహేశ్ బిగాల ఆయా కంపెనీల ప్రతినిధులతో తెలిపారు. రానున్న రోజుల్లో ఈ ఐటీ హబ్ నిర్మాణంతో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఐటిరంగంలో మరింత అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.