సూపర్ స్టార్ మహేష్ బాబు పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ని చాలా బాగా మేనేజ్ చేస్తుంటారు. ఒకవైపు షూటింగ్స్తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీ టూర్స్కి బ్రేక్ రాకుండా చూసుకుంటారు. మహేష్ బాబు ప్రస్తుతం “సర్కార్ వారి పాట” సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ సినిమా షూటింగ్ గోవాలో కొద్ది రోజులుగా జరుగుతూ వస్తుంది.
ఆగస్టు 9న మహేష్ బాబు తన 46 వ పుట్టిన రోజు కాగా, ఈ పుట్టిన రోజును షూటింగ్ సభ్యులతో మాత్రమే కాకుండా తన కుటుంబంతో కూడా జరుపుకోవాలి అనుకున్న మహేష్ బాబు తన కుటుంబంతో పాటు గోవాకి వెళ్లారు. ఒకవైపు షూటింగ్లో పాల్గొంటూనే ఖాళీ సమయంలో ఫ్యామిలీతో గోవా అందాలని వీక్షించాడు.దర్శకుడు వంశీ పైడిపల్లి కుటుంబం కూడా టూర్లో పాల్గొంది.
గోవా టూర్ ముగియండంతో అందరు చార్టర్డ్ ఫ్లైట్లోతిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఫ్లైట్లో దిగిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ మరియు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ పతాకాలు సంయుక్తంగా నిర్మిస్తున్న సర్కారు వారి పాట చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కాబోతున్నట్టు దర్శకనిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది.