Mahesh Babu | బ్రేక్ దొరికితే చాలు తనకిష్టమైన ప్రదేశాలకు టూర్ ప్లాన్ చేస్తుంటాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Superstar Mahesh). సినిమాలు, బ్రాండ్ల ప్రమోషన్స్తో ఎప్పుడూ బిజీగా ఉండే ఈ సూపర్ స్టార్ తీరిక సమయం దొరికితే చాలు ఏదో వెకేషన్ (Tour) ప్లాన్ చేస్తాడు. అయితే ఎప్పటిలాగే ఈ సారి కూడా మహేశ్ (Mahesh Babu) ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి వెకేషన్ టూర్కు వెళుతున్నాడు. కూతురు సితార పుట్టినరోజు (జూలై20) సెలబ్రేట్ చేసిన మహేశ్.. అంతలోనే కుటుంబంతో పాటు విహారయాత్రకు ప్లాన్ చేశాడు. తాజాగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్లో భార్యా నమ్రత శిరోద్కర్ (Namrata shirodkar), కుమార్తె సితార(Sitara), కొడుకు గౌతమ్లతో కలిసి కనిపించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్వకత్వంలో గుంటూరు కారం (Guntur Kaaram) సినిమా చేస్తున్నాడు మహేశ్ బాబు. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నది. తమన్ సంగీతాన్నందిస్తున్నారు.
అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే లాంఛ్ చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ నెట్టింటిని షేక్ చేస్తోంది. ఈ చిత్రాన్ని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేయనున్నారు. మహేశ్ బాబు మరోవైపు త్వరలోనే ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) దర్శకత్వంలో చేయబోతున్న ఎస్ఎస్ఎంబీ 29ను కూడా లాంఛ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.