హైదరాబాద్ : కొవిడ్ మహమ్మారి కలవరానికి గురి చేస్తున్నది. నిత్యం ఎంతో మంతి సాధారణ జనంతో పాటు పలువురు ప్రముఖులు హమ్మారి బారినపడుతున్నారు. ఇటీవల రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు వైరస్ సోకగా.. చికిత్స పొందుతున్నారు. తాజాగా మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సైతం కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారంతా ముందు జాగ్రత్తగా కొవిడ్ పరీక్షలు చేసుకోవాలని సూచించారు.
ఇదిలా ఉండగా.. ఇవాళ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డితో పాటు ఆయన సతీమణి, వరంగల్ జడ్పీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి సైతం కరోనా పాజిటివ్గా పరీక్షించారు. మంగళవారం జ్వరం రావడంతో పరీక్షలు చేసుకోగా కొవిడ్ పరీక్షలు చేసుకోగా.. పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. నిన్న మంత్రులు నిరంజన్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అనంతరం మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి హెలీకాప్టర్లో హైదరాబాద్కు వచ్చారు.