ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. రెండో దశలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 49,447 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా వల్ల ఒక్క రోజు వ్యవధిలోనే 277 మంది మృతిచెందారు. కొవిడ్ నుంచి 37,821 మంది కోలుకున్నారు.
ఒక్క ముంబై నగరంలోనే 24 గంటల్లో కొత్తగా 9,090 మందికి వైరస్ సోకగా, 27 మంది చనిపోయారు.ప్రస్తుతం రాష్ట్రంలో 4,01,172 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 24,95,315కు చేరింది. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 55,656కు పెరిగింది.