ముంబై : మహారాష్ర్ట ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కరోనా టీకా రెండో డోసు ఇవాళ తీసుకున్నారు. మార్చి 11వ తేదీన మొదటి డోసును ఆయన తీసుకున్నారు. మహారాష్ర్టలో కరోనా టీకాల కొరత ఉందని ఆ రాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. మహారాష్ర్టలో వ్యాక్సిన్ల కొరత ఉందన్న మాట అవాస్తవమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు.
మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 59,907 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, 322 మంది మృతిచెందారు. ఒక్కరోజు వ్యవధిలోనే 30,296 మంది కోలుకున్నారు. ముంబై నగరంలోనే కొత్తగా 10,428 మందికి వైరస్ సోకింది. 24 గంటల్లో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 31,73,261కు చేరింది. ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 56,652కు పెరిగింది.