మహబూబ్నగర్, నవంబర్ 6 : అంగన్వాడీ కేంద్రాల తనిఖీకి ప్రత్యేక బృందాల ను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఐసీడీఎస్ అధికారులతోపాటు ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కా ర్యక్రమంపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సం దర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు సరైన పౌష్టికాహారం అందించడంతోపాటు ఆరోగ్య సం రక్షణకు తీసుకుంటున్న చర్యలపై ప్రత్యేక బృందాలు పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారంతోపా టు గుడ్డు, పాలు సక్రమంగా అందించాలని సూచించారు. పిల్లల పెరుగుదల చార్ట్ను తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. డీపీవో సహకారంతో అంగన్వాడీ కేంద్రా లు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తనిఖీ బృందాల్లో మండలస్థాయి అధికారులు ఉంటారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలతోపాటు పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం పరిశీలించనున్నట్లు పేర్కొన్నా రు. అలాగే అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యం లో స్వచ్ఛతా పక్వాడ కార్యక్రమంపై నిర్ల క్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. అనంతరం ఈ-శ్రామ్ స్టేటస్పై కలెక్టర్ సమీక్షించారు. దీనిపై అందరికీ అవగాహన కల్పించి వందశాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని డీడబ్ల్యూవో రాజేశ్వరిని ఆదేశించారు. అంగన్వాడీ టీచర్లు ఇంటింటికెళ్లి కొవిడ్ వ్యాక్సిన్ అర్హులందరికీ వేయించాలని సూచించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా దాదాపు 90శాతానికిపైగా అంగన్వాడీ టీచర్లను బీఎల్వోలుగా నియమించామని, నవంబర్ 1నుంచి 30వ తేదీ వరకు ఓటర్ల జాబితా సవరణ చేపట్టినట్లు తెలిపారు. 2022 జనవరి 1 నాటికి 18 ఏండ్లు పూర్తయితే నూతన ఓటరుగా నమో దు చేసుకునే అవకాశం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. వీసీలో డీడబ్ల్యూవో రాజేశ్వ రి, సీడీపీవోలు, సూపర్వైజర్లు ఉన్నారు.