డోర్నకల్, మార్చి 20 : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో పల్లా రాజేశ్వర్ రెడ్డి మెజార్టీతో గెలుపొందడంతో మండల కేంద్రంలోని మసీదు సెంటర్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నున్న రమణ ఆధ్వర్యం లో టీఆర్ఎస్ నాయకులు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టపాకాయలు పేల్చి, స్వీట్లు పంపిణీ చేశా రు. అనంతరం టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నున్న రమణ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన అభివృద్ధి సంక్షే మ ఫలాలు పల్లాను భారీ మెజార్టీతో గెలిపించాయన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కత్తెరసాల విద్యాసాగర్, మండల కో ఆప్షన్ సభ్యుడు షేక్ లాల్ మియా, వార్డు కౌన్సిలర్లు పోటు జనార్దన్, కాల సురేందర్ జైన్, బోరిగాల్ల శరత్ బాబు, అశోక్, మున్సిపల్ కో ఆప్ష న్ సభ్యులు రాంభద్రం, షేక్ అజిత్ మియా, టీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు మంద రాజేంద్ర ప్రసాద్, ఎస్సీసెల్ పట్టణ అధ్యక్షుడు పోకాల శేఖర్, కాల యశోధర్ జైన్, కం దుల నరేశ్, రహీం, విక్కి, సలీం, పచ్చిపాల శ్రీనివాస్, కొత్త కుమార్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
నర్సింహులపేట : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి గెలుపును హర్షిస్తూ మండల కేంద్రంలో శనివారం రాత్రి నర్సింహులపేట గ్రామశాఖ ఆధ్వర్యంలో పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామశాఖ అధ్యక్షుడు కొండబత్తుల జగదీశ్వర్ మాట్లాడుతూ పట్టభద్రులు ప్రగతికి పట్టం కట్టారన్నారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని ఆకాంక్షించి పల్లా రాజేశ్వర్రెడ్డిని గెలిపించారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు విరారెడ్డి, కర్ల నాగన్న, అల్వాల నవీన్, వేముల విజయ్, మిర్యాల వెంకన్న, నరేశ్, వీరన్న, యాదగిరి, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.