ముంబై: సోషల్ మీడియాలో ఇప్పుడు కచ్చా బాదామ్ సాంగ్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ సాంగ్పై సెలబ్రిటీలు కూడా డ్యాన్స్ వేసి వీడియోలను పోస్టు చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ కూడా కచ్చా బాదామ్ సాంగ్కు స్టెప్పులేసింది. రితేశ్ దేశ్ముఖ్తో కలిసి డ్యాన్స్ చేసిన ఆ వీడియోను మాధురీని తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది. పశ్చిమ బెంగాల్కు చెందిన పల్లీలు అమ్మే వ్యాపారి భూబన్ బద్యేకర్ పాడిన కచ్చా బాదామ్ పాట సోషల్ మీడియాలో చాన్నాళ్ల నుంచి ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే మాధురీ దీక్షిత్ అయిదు రోజుల క్రితం పోస్టు చేసిన వీడియోకు 12 మిలియన్ల వ్యూవ్స్ వచ్చాయి.