న్యూఢిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బర్గోహై శుభారంభం చేసింది. ఇస్తాంబుల్ వేదికగా సోమవారం 70 కేజీల విభాగంలో జరిగిన తొలి రౌండ్లో భారత స్టార్ బాక్సర్ లవ్లీనా 3-1తో ప్రపంచ మాజీ చాంపియన్ చెన్ నియెన్-చిన్ (చైనీస్ తైపీ)ను చిత్తు చేసి ముందంజ వేసింది. తదుపరి రౌండ్లో శుక్రవారం సిండీ నంబాతో లవ్లీనా తలపడనుంది. టోక్యో ఒలింపిక్స్లో చెన్ను చిత్తు చేసి కాంస్యం కొల్లగొట్టిన లవ్లీనా ప్రపంచ చాంపియన్షిప్లో కూడా ఆమెపై మరోసారి పై చేయి సాధించడం విశేషం.