బీజింగ్, అక్టోబర్ 25: చైనాలో కరోనా మళ్లీ కోరలు చాస్తున్నది. తాజాగా ఇజిన్ అనే కౌంటీలో కరోనా డెల్టా వేరియంట్ ప్రబలింది. అక్కడ నివసిస్తున్న దాదాపు 35,700 మంది ప్రజలు ఇండ్లలోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. బయటకొస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇటీవల బయటపడిన మొత్తం 150 కేసుల్లో మూడొంతులు మంగోలియా సరిహద్దులో ఉన్న ఈ కౌంటీలోనే నమోదయ్యాయి. వారం వ్యవధిలో 11 ప్రావిన్సుల్లో కరోనా ప్రబలి, పరిస్థితి తీవ్రరూపం దాలుస్తుందని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ హెచ్చరించిన మరుసటి రోజే ఈ కౌంటీలో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. సోమవారం ఒక్క రోజే చైనాలో 38 కరోనా కేసులు నమోదయ్యాయి.