బంజారాహిల్స్,నవంబర్ 18: ఇండియన్ ఐడోల్ పోటీల్లో పాల్గొని టాప్-12లో చోటు సంపాదించుకున్న ఐదుగురు టాప్ సింగర్స్ డిసెంబర్ 18న నగరంలోని సంగీత ప్రియులను అలరించనున్నారు. మాదాపూర్లోని శిల్ప కళావేదికలో ఫొట్లోస్ -5పేరుతో లైవ్ కన్సెర్ట్ నిర్వహించనున్నారు. గురువారం బంజారాహిల్స్లోని ప్రసాద్ ఫిలిం ల్యాబ్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇండియన్ ఐడోల్ ఫైనలిస్ట్, తెలుగు రాక్స్టార్ షణ్ముఖప్రియ కాన్సర్ట్ వివరాలను వెల్లడించారు. తనతో పాటు ఇండియన్ ఐడోల్ పోటీల్లో పాల్గొని టాప్ 12 ఫైనలిస్ట్స్గా నిలిచిన సింగర్ పవన్దీప్, అరుణిత, సైలీ,డానిష్ ఒకేవేదికపై పాడనున్నామన్నారు. ఇండియన్ ఐడోల్ పోటీల తర్వాత ఐదురుగు సింగర్స్ ఒకే వేదికలో పాడడం దేశంలో ఇదే మొట్టమొదటిసారి అని పేర్కొన్నారు.