అహ్మదాబాద్, జనవరి 20: గుజరాత్లోని పోర్బందర్ జిల్లా పరిధిలోని వన్యప్రాణుల అభయారణ్యంలో తొలిసారిగా ఓ సింహం కనిపించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ అభయారణ్యంలో సింహం కనిపించడం ఇదే తొలిసారి అని అధికారులు చెప్పారు. అభయారణ్యంలోకి వచ్చిన మగ సింహం వయసు మూడున్నరేండ్లు ఉంటుందని, దాని కదలికలను నిత్యం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. దీని రాకతో తమలో మరింత ఆశ చిగురించిందని, అభయారణ్యాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. భవిష్యత్లో మరిన్ని వన్యప్రాణులు వచ్చే అవకాశముందన్నారు.