హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): లతా మంగేష్కర్ మృతి పట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంతాపం తెలిపారు. లత మరణంపై తమిళిసై సౌందర్రాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దశాబ్దాలపాటు ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన లతా మంగేష్కర్ మరణం సినీ రంగానికి తీరని లోటు అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. పాటల రూపంలో ఆమె వారసత్వం శాశ్వతంగా నిలిచి ఉంటుందన్నారు. లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
లత లేని లోటును ఎప్పటికీ పూరించలేమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్గౌడ్, మల్లారెడ్డి, జగదీష్ రెడ్డి, సత్యవతిరాథోడ్, ప్రశాంత్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, నిరంజన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్కుమార్, గంగుల కమలాకర్ లతా మంగేష్కర్ మృతిపై విచారం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత నామా నాగేశ్వరరావు, ఎంపీ సంతోష్ కుమార్, పీఏసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి మంగేష్కర్ మృతి పట్ల సంతాపం తెలిపారు. ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, సురభి వాణిదేవిలు లత మంగేష్కర్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘లతా జీ మరణంతో అందమైన మధురమైన శకం ముగిసింది’ అని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్కుమార్, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఏపీ సీఎం జగన్ తదితరులు లత మృతి పట్ల సంతాపం ప్రకటించారు.