సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ): లాలాగూడ ఠాణా ఎస్హెచ్వోగా తొలిసారిగా ఓ మహిళ అధికారి మంగళవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆదివారం షీటీమ్స్ ఆధ్వర్యంలో పీపుల్స్ప్లాజాలో 2కే, 5కే రన్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సిటీ సీపీ సీవీ ఆనంద్ మహిళా ఇన్స్పెక్టర్ను ఎస్హెచ్వోగా నియమిస్తామని వెల్లడించారు. ఇందులోభాగంగానే మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ‘లాలాగూడ’ ఎస్హెచ్వోగా మహిళా అధికారికి డ్యూటీ అప్పగించనున్నారు. ఉదయం 10.30 గంటలకు హోం మంత్రి మహమూద్ అలీ, పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సమక్షంలో ఆమె బాధ్యతలు తీసుకోనున్నారు.