గతేడాది బుల్ మార్కెట్.. మ్యూచువల్ ఫండ్లకు కాసుల వర్షం కురిపించింది. వివిధ మ్యూచువల్ ఫండ్లు మొత్తం 140 స్కీములను మార్కెట్లోకి ప్రవేశపెట్టగా, రూ.99,704 కోట్లను సమీకరించాయి. ఆగస్టు నెలలో గరిష్ఠంగా రూ.23,668 కోట్లను అందుకోగా, ఏప్రిల్లో కనిష్ఠంగా రూ.540 కోట్లను దక్కించుకున్నాయి. ఇందులో అత్యధికంగా ఈక్విటీ ఫండ్ స్కీములు రూ.49,389 కోట్లను పొందాయి. హైబ్రిడ్ ఫండ్లు రూ.21,836 కోట్లు, డెట్ ఫండ్లు రూ.10,564 కోట్లు, ఇంటర్నేషనల్ ఫండ్లు రూ.6,351 కోట్ల మేర చేజిక్కించుకున్నాయి. కాగా, గరిష్ఠంగా ఎస్బీఐ బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ రూ.14,551 కోట్లను, ఆ తర్వాత ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ రూ.9,808 కోట్లను సమీకరించగలిగాయి. ఈక్విటీ సెగ్మెంట్లో మల్టీ క్యాప్ ఫండ్లకు అధిక ఆదరణ లభించింది.