లఖింపూర్ఖేరి: యూపీలోని లఖింపూర్ఖేరిలో ఇద్దరు దళిత అక్కాచెల్లెళ్ల రేప్, హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన అటాప్సీ రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. బాధితుల్ని రేప్ చేసి, హత్య చేసినట్లు అటాప్సీ నివేదికలో తేల్చారు. అక్కాచెల్లెళ్లను చెట్టుకు ఉరివేసి వేలాడదీసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఆరుగుర్ని అరెస్టు చేశారు. చోటూ, జునైద్, సుహేల్, కరీముద్దీన్, ఆరిప్, హఫీజ్ ఆ లిస్టులో ఉన్నారు. బాధిత కుటుంబానికి భౌతికకాయాలను అప్పగించినట్లు అదనపు డీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.